మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్!

మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్!

లాక్‌డౌన్ వల్ల 40 రోజులుగా మద్యం లేక మందుబాబులు అల్లాడిపోతున్నారు. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైన్ షాపులకువచ్చే వారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో మందుబాబులకు ఏపీ సర్కార్ షాకిచ్చింది. మద్యం ధరలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలతోనే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story