మరోసారి సర్జికల్ దాడులు చేయాలి: శివసేన
By - TV5 Telugu |5 May 2020 5:58 PM GMT
భారత్ మరోసారి సర్జికల్ దాడులు చేయాలని శివసేన పేర్కొంది. అయితే, ఈ దాడులను ప్రచార ఆర్భాటాలకు వాడుకోకూడదని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లోని హంద్వారాలో రెండు రోజుల క్రితం సైనికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు భారత సైనికులు చనిపోయారు. భారత గడ్డపై ఉగ్రవాదులు చేసిన ఈ దాడి మంచిది కాదని.. వారికి బుడ్డి చెప్పాల్సిందేనని శివసేన తన అధికారిక పత్రిక సామ్నా ద్వారా స్పష్టం చేసింది. కచ్చితంగా మరోసారి సర్జికల్ దాడులు జరగాల్సిందేనాని.. అయితే, దానిని ప్రచారం చేసుకోకూడదని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com