కరోనాతో దేశంలో ఒక్కరోజే 126 మంది మృతి

కరోనాతో దేశంలో ఒక్కరోజే 126 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1694 కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 126 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story