క్వారంటైన్ సెంట‌ర్ నుంచి ముగ్గురు పరార్!

క్వారంటైన్ సెంట‌ర్ నుంచి ముగ్గురు పరార్!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 49 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా అనుమానితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే పనిలో స్పీడ్ పెంచారు. అనుమానితులందర్నీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ లని రిపోర్టులు వస్తే వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌ నుంచి, ఐసోలేషన్ వార్డుల నుంచి కరోనా రోగులు పారిపోతున్నారు. తాజాగా ఒడిషాలో కూడ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

క‌రోనా పాజిటి‌వ్ గా నిర్దార‌ణ అయిన ముగ్గురు వ్య‌క్తులు క్వారంటైన్ సెంట‌ర్ నుంచి పారిపోయారు. గ‌డచిన 24 గంట‌ల్లో ముగ్గురు వ్య‌క్తులు హాస్పిటల్‌లో నుంచి సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి పారిపోయారు. లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు. ఆ ముగ్గురిని ప‌ట్టుకుని క్వారంటైన్ సెంట‌ర్ లో చేరుస్తామ‌ని ఒడిశా పబ్లిక్ రిలేష‌న్స్ విభాగం అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story