ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరింది. ఇప్పటివరకు 780 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారిన పడి గురువారం కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story