మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం: సీఎం జగన్

మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం: సీఎం జగన్

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన చాలా బాధకరమన్నారు ఏపీ సీఎం జగన్‌. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితను పరామర్శించారాయన. అనంతరం మాట్లాడిన సీఎం జగన్‌.. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయాలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story