శ్వేతసౌధంలో రెండో కరోనా కేసు

శ్వేతసౌధంలో రెండో కరోనా కేసు

అమెరికా దేశ అధ్యక్షుడి అధికార నివాసమైన శ్వేతసౌధంలో రెండో కరోనా కేసు నమోదైంది. అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా వైరస్ సోకిందని తేలటంతో ఆ దేశంలో సంచలనం రేపింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న కేటీ మిల్లర్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని.. అక్కడి అధికారులు వెల్లడించారు. గతంలో కూడా వైట్‌హౌస్‌లో ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది. అయితే, అప్పట్లో కరోనా సోకిన అధికారి పేరు వెల్లడించలేదు. కేటీ మిల్లర్ అనే యువతికి గతంలో ఒకసారి పరీక్షలు చేసినా.. నెగెటివ్ వచ్చిందని.. కానీ, కరోనా సోకినట్టు తేలిందని ట్రంప్ తెలిపారు. కేటీ మిల్లర్ తో తాను కలవలేదని, ఆమె ఉద్యోగరీత్యా ఉపాధ్యక్షుడితో కలుస్తుంటారని ట్రంప్ చెప్పారు. దీంతో అమెరికాలో ఆందోళన మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story