ఏపీలో కొత్తగా 36 కేసులు నమోదు

X
By - TV5 Telugu |14 May 2020 8:01 PM IST
ఏపీలో రోజు రోజుకూ కరోనా విస్తరిస్తూనే ఉంది.. గురువారం కొత్తగా 36 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2వేలు దాటింది. వలస కూలీలను మినహియిస్తే ఇప్పటికే రాష్ట్రంలో 2100 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48 మంది మృతి చెందారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 850కి తగ్గింది..
గురువారం నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 9 మందికి నిర్ధారణ అయ్యింది. గుంటూరులో 5, కడప, కృష్ణా జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళంలో మరో రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com