ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన స్కార్పియో.. స్పాట్లోనే ముగ్గురు..
By - TV5 Telugu |16 May 2020 2:09 PM GMT
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. బీహార్ నుంచి కేరళ వెళ్తున్న స్కార్పియో వాహనం ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. డిచ్పల్లి మండలం నాకా తండా వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో అనీష్ థామస్, అతని కొడుకు అనలియాతో పాటు స్టాలిన్ అనే వ్యక్తి ఉన్నారు. వీరంతా కేరళకు చెందిన టీచర్లుగా తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com