ఆటో, ట్యాక్సీ వాహనదారులకు రూ.10వేలు ఆర్థిక సాయం

ఏపీ సీఎం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానం.. వాహన మిత్ర పథకం ద్వారా రూ.10వేలు ఆర్థిక సాయం. గత ఏడాది అక్టోబర్లో ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆమొత్తాన్ని అందజేశారు. ఈ ఏడాది కూడా అదే నియమాన్ని కొనసాగిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. జూన్ 4న రెండో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర ఆర్థిక సాయం విడుదల చేస్తామని, కొత్తగా ఎవరైనా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసి ఉంటే ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోమని మంత్రి తెలిపారు. అయితే ఈ పథకం ఇంటికి ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఒకరి పేరు మీద బండి కొని, మరొకరి పేరు మీద లైసెన్స్ ఉన్నా సాయం అందుతుంది. గత ఏడాది ఆర్థిక సాయం పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది అర్హులను నిర్ణయించే ప్రక్రియ చేపడుతుంది అని మంత్రి నాని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com