ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 వేల 407కి చేరింది. ఇప్పటికి 53 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోలుకుని 1 వెయ్యి 639 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 43 మంది డిశ్చార్జ్ అవగా ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 కేసులకు కోయంబేడు లింకులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్‌ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story