తెలంగాణలో తాజాగా 42 కరోనా కేసులు.. 4 మృతులు
By - TV5 Telugu |19 May 2020 11:31 PM GMT
తెలంగాణలో కరోనా రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 42కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,634కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం 9 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 1,011 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు నలుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 38కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా.. మరో 8 మందికి వలస కూలీలకు సోకినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com