ఏపీకి కృష్ణా నదీ యాజమాన్యం బోర్డ్ షాక్

X
By - TV5 Telugu |20 May 2020 3:43 AM IST
సాగర్ కుడి కాలువకు హంద్రీనీవా నీటిని ఆపాలంటూ ఏపీకి కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు లేఖ రాసింది. మే నెల వరకు చేసిన కేటాయింపుల కంటే.. ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో కేఆర్ఎంబీ పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు విధిగా పాటించాలని.. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వొద్దన్న బోర్డు సూచించింది. కుడి కాలువ ద్వారా 158.26 టీఎంసీలు.. హంద్రీనీవా ద్వారా 47.17 టీఎంసీలు వాడుకున్నారని.. ఏపీకి కేటాయించిన నీటిని మొత్తం ఇప్పటికే వాడుకున్నారని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com