ఏపీలో ఒక్కరోజే 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో ఒక్కరోజే 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8 వేల 92 శాంపిల్స్ పరీక్షించగా 45 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 వేల 452కు చేరుకుంది. 41 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1680కి చేరింది. ప్రస్తుతం 718 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 54కు చేరింది.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజటివ్ కేసులలో చిత్తూరు జిల్లా నుంచి 2, నెల్లూరు జిల్లా నుంచి 2.. మొత్తం 4 కోయంబేడు కాంటాక్ట్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చివారిలో ఇప్పటివరకు మొత్తం 153 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీటిలో ప్రస్తుతం 128 యాక్టివ్ కేసులున్నాయి. ఒడిశా నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 101, గుజరాత్ 26, కర్నాటక 1, పశ్చిమ బెంగాల్ 1 రాజస్థాన్ 11, తమిళనాడు నుంచి 3 కేసులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story