భారత్ నుంచే వైరస్ వ్యాప్తి: నేపాల్ ప్రధాని

భారత్ నుంచే వైరస్ వ్యాప్తి: నేపాల్ ప్రధాని

అసలే సరిహద్దు ప్రాంతాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్‌తో వైరం పెంచుకుంటోంది నేపాల్. ఈ తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్‌పై మరోసారి విరుచుకుపడుతున్నారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలోకి కరోనా వైరస్ వస్తోందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌లో ప్రసంగించిన కేపీ శర్మ భారత్ నుంచి అక్రమ మార్గాల ద్వారా నేపాల్‌కి వచ్చిన వారు దేశంలో వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారని అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు పరీక్షలు నిర్వహించకుండానే వారిని లోపలికి తీసుకువస్తున్నారని అన్నారు. చైనా, ఇటలీ నుంచి వచ్చే వైరస్ కంటే ఇండియా నుంచి వచ్చే వైరస్సే ప్రాణాంతకమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story