హమ్మయ్య.. వేడిగాలుల నుంచి ఇక ఉపశమనం

హమ్మయ్య.. వేడిగాలుల నుంచి ఇక ఉపశమనం

గతవారం రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తీవ్రమైన వేడిగాలులతో జనం ఇబ్బందులకు లోనవుతున్నారు. రాత్రి సమయంలో కూడా వేడిగాలులు వీస్తుండటంతో.. చిన్న పిల్లలు, ముసలివారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, గురువారం నుంచి ఈ వేడిగాలులు తగ్గుతాయని ఇండియా మెటియరాలాజికల్ డిపార్ట్ మెంట్ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. వేడిగాలుల నుంచి జనం కొంచెం కొంచెం ఉపశమనం పొందుతారని అన్నారు. కొన్ిన ప్రాంతాలలో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు. గత రెండు రోజులుగా రాజస్థాన్ లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. కానీ, ఇకపై వేడిగాలుల తీవ్రత తగ్గుముఖం పడతాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story