మా మనిషినే ఉద్యోగంలో నుంచి తొలగిస్తావా.. వైసీపీ కార్యకర్త వీరంగం

మా మనిషినే ఉద్యోగంలో నుంచి తొలగిస్తావా.. వైసీపీ కార్యకర్త వీరంగం

తిరుపతిలో వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. మా మనిషినే ఉద్యోగంలో నుంచి తొలగిస్తావా ‌అంటూ పంచాయతీ సెక్రటరీ పై చిందులు తొక్కాడు. ఆఫీసులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. విధులు సరిగా నిర్వర్తించడం లేదంటూ తిరుపతిలో రవి అనే వలంటీర్‌ను పంచాయతీ కార్యదర్శి తొలగించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త అనిల్ రెడ్డి కోపంతో ఊగిపోయాడు. మా మనిషినే తొలగిస్తారా అంటూ పంచాయతీ సెక్రటరీపై మండిపడ్డాడు. అధికారం మాది నీ అంతు చూస్తానంటూ బెదరించాడు. నీ ఇష్టం వచ్చినవాళ్లకు చెప్పుకో అంటూ దుర్భాషలాడాడు. సరిగ్గా పనిచేయని వలంటీర్లను తొలగించమని స్వయంగా నగర పాలక సంస్థ కమిషనరే ఆదేశించారని, అందుకే రవిని తొలగించామని పంచాయతీ సెక్రటరీ చెబుతున్నారు. వైసీపీ కార్యకర్త అనిల్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story