రోగ నిరోధక శక్తిని పెంచే సత్తా యోగాకు ఉంది: మోదీ

రోగ నిరోధక శక్తిని పెంచే సత్తా యోగాకు ఉంది: మోదీ

కరోనాపై విజయం సాధించడానికి మనం మరింత శ్రమించాలన్నారు ప్రధాని మోదీ. ఆయన దేశ ప్రజలకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల కోసం పనిచేస్తున్నాయన్నారు. కరోనా సంక్షోభంలో బాగా ఇబ్బంది పడింది వలస కూలీలేనని మోదీ అన్నారు. ఆత్మ నిర్భర భారత్‌ దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు స్వదేశీ వస్తువులనే కొంటున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలతో తాను కరోనా సంక్షోభంపై మాట్లాడానన్నారు మోదీ. వారితో మాట్లాడినప్పుడు యోగా, ఆయుర్వేదం గురించి తనను అడిగారన్నారు మోదీ. రోగ నిరోధక శక్తిని పెంచే సత్తా యోగాకు ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story