కరోనాకు తోడు.. రక్తం పీల్చే కీటకాలు.. రష్యా అతలాకుతలం
By - TV5 Telugu |2 Jun 2020 8:54 PM GMT
కరోనా వేగంగా విజృంభిస్తున్న రష్యాలో మరో ఉపదృవం వచ్చిపడింది. కరోనా కేసుల్లో ప్రపంచంలో రష్యా మూడోస్థానంలో ఉంది. దీంతో అధికారులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. అయితే, దీనికి తోడు.. రక్తం పీల్చే కీటకాలు రష్యా ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ కీటకాలు సాధారణంగా సైబీరియాలో ఎక్కువగా ఉంటాయి. అయితే.. అవి ఇప్పుడు సాదారణ స్థాయి కంటే 428 రెట్లు పెరిగినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ఇవి కుట్టి చాలా మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయితే.. ఈ కీటకాల బారినపడిన వారు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు సరిపడని పరిస్థితి ఎదురవుతుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com