కరోనా వ్యాధికి ప్లాస్మాథెరపీతో మంచి ఫలితాలు.. పరిశోధనల్లో వెల్లడి

X
By - TV5 Telugu |3 Jun 2020 11:37 PM IST
కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని కనిపెట్టే పనిలో ప్రపంచదేశాలు పడ్డాయి. అయితే, కరోనా రోగులకు పలు దేశాలు ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నాయి. అయితే, ఈ చికిత్సపై జరిపిన అధ్యాయనాల్లో.. ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని తేలింది. అమెరికాలోని హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రి పరిశోధకులు మార్చి 28న ప్లాస్మా చికిత్సపై క్లినికల్ ట్రయన్స్ ప్రారంభించారు. కరోనాతో బాధపడుతున్న 25 మందికి ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందించారు. ఇందులో 19 మంది కోలుకోగా.. 11 డిశ్చార్జ్ అయ్యారని పరిశోధకులు తెలిపారు. ఇంకా కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ విధానాన్ని మరింత వేగంవంతం చేయాలని చూస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com