తెలంగాణలో కరోనా విలయతాండవం.. కొత్తగా 206 కేసులు

X
By - TV5 Telugu |7 Jun 2020 5:20 AM IST
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా కేసులే కాదు.. కొత్తగా నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 206 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, 10 మంది కరోనాతో మరణించినట్టు తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 123కి చేరాయి. కాగా తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో 3,496 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 1,710 మంది డిశ్చార్జ్ కాగా 1,663 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com