ఢిల్లీ మంత్రికి కరోనా నెగిటివ్

X
ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్రజైన్కు కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆయనకు నెగిటివ్ వచ్చిందని.. సాదారణమైన జ్వరం మాత్రమేనని వైద్యులు తెలిపారు. సోమవారం ఆయన జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, కరోనా లక్షణాలు కనిపించడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని.. సత్యేంద్ర జైన్ ట్వీటర్ ద్వారా స్వయంగా ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతవారం ఢిల్లీ సీఎం కూడా కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
