తమిళనాడులో కరోనా విలయతాండవం.. ఓ మంత్రికి పాజిటివ్

తమిళనాడులో కరోనా విలయతాండవం.. ఓ మంత్రికి పాజిటివ్

తమిళనాడులో కరోనా విలయంతాడవం చేస్తుంది. సామాన్యులతోపాటు అధికారులకు, నేతలకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తమిళనాడు విద్యాశాఖమంత్రి కేపీ అంబళగన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆయనకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అటు, డీఎంకే ఎమ్మెల్యే అంబఝగన్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. పళని కరోనాతో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పడు మంత్రికి కరోనా పాజిటివ్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కాగా.. తమిళనాడులో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు చెన్నైలో ఏకంగా 2000 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story