తెలంగాణలో కరోనా పరీక్షలు వేగవంతం

తెలంగాణలో కరోనా పరీక్షలు వేగవంతం

తెలంగాణలో కోవిద్-19 విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 3363గా ఉన్నాయి. శనివారం 154 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3506కు చేరింది. ఇక మరో ఐదుగురు కరోనాకు బలి కాగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 203కి చేరింది.

కొత్త కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో458, రంగారెడ్డి 50, మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, ఖమ్మం 2, కరీంనగర్ 13, వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 2, జనగామ 10, ఆదిలాబాద్ 1 నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 458 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజులో 3188 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 546 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 53,575కు చేరింది. శనివారం 2,642 ఫలితాలు నెగటివ్‌గా తేలింది.

మరోవైపు టెస్టులు సైతం వేగంగా చేస్తున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, కాకతీయ మెడికల్ కాలేజీ , హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story