బొలివియా సెనెట్ అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్
By - TV5 Telugu |12 July 2020 9:46 AM GMT
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా వైరస్ సినీ, రాజకీయ నాయకుల నుంచి మంత్రులు, దేశాధ్యక్షుల వరకు ఎవ్వరిని వదలడం లేదు.
తాజాగా బొలివియా సెనెట్ అధ్యక్షురాలు మోనికా ఎవ కోపాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని బొలివియా తాత్కాలిక అధ్యక్షుడు జియనైన్ అనేజ్ చావేజ్ స్పష్టం చేశారు. కరోనా పరీక్షల్లో మోనికా ఎవ కోపాకు పాజిటివ్గా నిర్థారణ అయిందని తెలిపారు.
ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా బొలివియాలో ఇప్పటివరకు 44వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com