గుడ్ న్యూస్.. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అంతా పాస్‌

గుడ్ న్యూస్.. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అంతా పాస్‌

తెలంగాణలో ఈ ఏడాది ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్న వారందరు పాస్‌ అయ్యారు. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్న వారందరినీ పాస్‌ చేస్తూ శుక్రవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పదో తరగతిలో 43 వేల మంది పాస్ అయ్యారు. ఇక ఇంటర్మీడియట్‌లో 32 వేల మంది విద్యార్థులు పాస్‌ అయ్యారని విద్యాశాఖ తెలిపింది. పాసైన వారందరికీ కనీసం 35 శాతం మార్కులు వేస్తున్నామని పేర్కొంది. ఇక ఒకేషనల్‌ కోర్సులు, ప్రాక్టికల్స్‌ పరీక్షల్లోనూ 35 శాతం మార్కులతో ఆందరిని పాస్‌ చేసినట్టు వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story