కరోనా పుట్టుకపై సంచలన వ్యాఖ్యలు చేసిన చైనా డాక్టర్
కరోనా చైనాలోనే పుట్టిందనే ఆరోపణలుకు బలాన్ని చేకూర్చేలా చైనాకు చెందిన ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా అందరు అనుకున్నట్టు చైనాలోని వూహాన్లోనే పుట్టిందని.. దానికి సంబందించిన ఆధారాలను అధికారులు నాశనం చేశారని అన్నారు. బీబీసీకి ఇంటర్వూ ఇచ్చిన హాంగ్కాంగ్ ప్రొఫెసర్ క్వాక్-యంగ్ యెన్ ఈ మేరకు తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైన రోజుల్లో ఈ మహమ్మారి మూలాలను తెలుసుకునేందుకు నియమించిన ప్రత్యేకమైన కమిటీలో జనవరి 18న తాను చేరానని.. తాము చేసిన పరిశీలనలో చాలా విషయాలు తెలుసుకున్నామని అన్నారు. ప్రధానంగా కరోనా పుట్టుక అక్కడినుంచే జరిగిందని చెబుతున్న వూహాన్ చేపల మార్కెట్లో తాము పరిశోధన చేసేందుకు వెళ్లామన్నారు. అయితే అప్పటికే అక్కడి ఆధారాలన్నింటినీ అధికారులు తుడిచేయడంతో వైరస్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం సాధ్యపడలేదని అన్నారు. ఆధారాలు నాశనం చేసే కంటే... ప్రజలను అప్రమత్తం చేస్తే.. కరోనా విజృంభణ ఈ స్థాయిలో ఉండేది కాదని యన్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com