బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం.. లక్షకు చేరువలో మృతులు

బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం.. లక్షకు చేరువలో మృతులు

బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం కొనసాగిస్తుంది. ప్రతీరోజు నమోదవవుతున్న కరోనా కేసులు, కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో 50,230 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 2,962,442కు చేరిందని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఒక్కరోజే 1,079 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 99,572 చేరింది. కరోనా కేసుల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story