అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

విజయవాడ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతలు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయలపాలైనవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబవించిన వివరాలు సీఎం జగన్.. ప్రధానికి తెలిపారు. అటు, మృతుల కుటుంబాలకు రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని సీఎం జగన్ వెల్లడించారు. అటు, ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story