బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌కి కరోనా పాజిటివ్

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌కి కరోనా పాజిటివ్

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ముషారఫ్ హుస్సేన్ కు కరోనా సోకింది. అతని తండ్రి నుంచి హుస్సేన్ కు సోకింది. సంవత్సర కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. దీనికి సర్జరీ కూడా చేసుకున్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని హుస్సేన్ ట్వీట్ చేశారు. తన తండ్రి నుంచి తనకు కరోనా సోకిందని.. దీంతో, తను స్వీయ నిర్భంధలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనతో పాటు తన భర్యా, బిడ్డకు కూడా కరోనా పరీక్షలు చేశామని.. అయితే, వారికి నెగెటివ్ వచ్చిందని అన్నారు. దీంతో వారిద్దరూ తనకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మాజీ కెప్టెన్ మ‌ష్రాఫ్ మోర్తాజా, మ‌రో ఇద్ద‌రు క్రికెట‌ర్లు న‌జ్ముల్ ఇస్లాం, న‌ఫీజ్ ఇక్బాల్‌కు ఈ ఏడాది జూన్‌లో క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. గ‌త వారం 18 మంది బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ల‌కు క‌రోనా సోకిన విష‌యం విదిత‌మే.

Tags

Read MoreRead Less
Next Story