AP : వైసీపీ దౌర్జన్యాలపై గవర్నర్కు టీడీపీ ఫిర్యాదు
By - Vijayanand |26 April 2023 9:11 AM GMT
వైసీపీ దౌర్జన్యాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. ప్రతిపక్ష పార్టీ సభలు, కార్యక్రమాలపై ప్రభుత్వ సహకారంతో.. అధికార పార్టీ దాడి చేస్తోందంటూ గవర్నరుకు ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు. యర్రగొండపాలెం ఘటన, ఎన్ఎస్జీ కమాండోకు గాయాల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్ధనగ్న నిరసనపైనా గవర్నర్ వద్ద ప్రస్తావించనున్నారు. ప్రతిపక్షాలపై దాడులకు పోలీసులను వాడుకుంటున్నారని గవర్నరుకు వివరించనున్నారు. ఎర్రగొండపాలెం ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను.. గవర్నరుకు అందచేయనుంది టీడీపీ నేతల బృందం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com