దళితుల ద్రోహి జగన్ రెడ్డి రా.. పాట విడుదల
By - Subba Reddy |8 May 2023 10:45 AM GMT
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విరుచుకుపడ్డారు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విరుచుకుపడ్డారు. దళితుల ద్రోహి జగన్ రెడ్డి రా.. అనే పాటల సీడీని ఆయన విడుదల చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై తిరగబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దళితులంటే జగన్ రెడ్డికి చులకన భావం ఎక్కువనీ.. అందుకే దళిత సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దళితులు మేనమామలంటూ వంచించి.. నిలువునా ముంచాడని మండిపడ్డారు. జగన్ పాలనలో దళితులు బ్రతకడం కష్టమని నక్కా ఆనంద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com