ఏపీలో కొత్తగా 10,418 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 10,418 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 71,692 శాంపిల్స్‌ ని పరీక్షించగా 10,418 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా..

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 71,692 శాంపిల్స్‌ ని పరీక్షించగా 10,418 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల కడపలో తొమ్మిది మంది, నెల్లూరు లో ఏడుగురు, ప్రకాశం లో ఏ‌డుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, అనంతపూర్‌ లో ఆరుగురు, చిత్తూర్‌ లో ఆరుగురు, గుంటూరు లో అరుగురు, పశ్చిమ గోదావరి లో అరుగురు, కృష్ణ లో ఐదుగురు, కర్నూల్‌ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, విజయనగరం లో ముగ్గురు , తూర్పు గోదావరి లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 9,842 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,24,617 పాజిటివ్ కేసు లకు గాను 4,22,712 మంది డిశ్చార్జ్ కాగా.. 4,634 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,271 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story