AP Corona : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!

AP Corona :  ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
AP Corona : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ వైరస్‌ తీవ్రత పెరిగిపోతోంది. తాజా ఏడు వేల చేరువలో పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

AP Corona : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ వైరస్‌ తీవ్రత పెరిగిపోతోంది. తాజా ఏడు వేల చేరువలో పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 38 వేల 55 సాంపిల్స్‌ పరీక్షించగా... 6 వేల 996 మంది వైరస్‌ బారినపడినట్లు నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక కరోనా కారణంగా విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే 15 వందల 34 మంది కరోనా బారినపడ్డారు.

విశాఖ జిల్లాలో 12 వందల 63 మంది, గుంటూరు జిల్లాలో 758 మంది, శ్రీకాకుళం జిల్లాలో 573 మందికి వైరస్‌ సోకింది. ఇటు అనంతపురం జిల్లాలో కూడా 462 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనపా నుంచి వెయ్యి 66 మంది కోలుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story