ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే మరోసారి కొనసాగిస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు.

27మందితో టీడీపీ జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. 25 మందితో పొలిట్ బ్యూరోను టీడీపీ ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ మరోసారి కొనసాగనున్నారు. అలాగే వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావును జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఇక టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్‌గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story