AP: గాజువాక తహసీల్దార్ ఆఫీసు ఎదుట టీడీపీ ధర్నా
By - Subba Reddy |7 Feb 2023 9:45 AM GMT
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు
విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం విశాఖ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గాజువాక నియోజకవర్గంలో 1900 పట్టాలు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పట్టాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. 301, 296, 388 జీవోలు తెచ్చి పూర్తి పారదర్శకంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దళారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com