AP: టీడీపీ నేత పట్టాభి ఆచూకీపై సస్పెన్స్
టీడీపీ నేత పట్టాభి ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతోంది. పట్టాభి జాడ తెలియకపోవడంతో ఆయన భార్య చందన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి పట్టాభి కనిపించడం లేదంటూ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గన్నవరం పీఎస్లో ఫిర్యాదు చేయాలని ముందు భావించినా.. పోలీసులు గన్నవరం వెళ్లనివ్వకపోవడంతో. ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అంతకు ముందు డీజీపీ ఇంటికి వెళ్లి నిరాహార దీక్ష చేస్తానని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో పట్టాభిని గన్నవరం కోర్టుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే పట్టాభితో వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరారు . దీనికి పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో బైక్పై డీజీపీ ఇంటికి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. అక్కడ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడంతో పోలీసులు చందనను అడ్డుకున్నారు. ఆమెను తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com