AP : కాకినాడ పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం

AP : కాకినాడ పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం

కాకినాడ జిల్లా పిఠాపురం వెల్ధుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. పామాయిల్‌ తోటల్లో పీపాల నుండి మంటలు ఎగసిపడుతున్నాయి.తారు పీపాలు,ఇతర కెమికల్‌ పీపాలను కాల్చి క్లీనింగ్‌ చేసే పక్రియలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఒక దానితో ఒకటి అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
పామాయిల్ తోటలో ఉన్న కెమికల్ డబ్బాలకు మంటలు అంటుకుని ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బాలు శుభ్రం చేస్తుండగా ఒకదానికి ఒకటి అంటుకుని మంటలు వ్యపించాయని స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుంటంతో పొగ కమ్మేసింది. కెమికల్ డబ్బాలనుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story