AP : న్యాయమూర్తి ఎదుటకు పట్టాభి

AP : న్యాయమూర్తి ఎదుటకు పట్టాభి
తెల్లవారుజాము 2:30 గంటలకు గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు

టీడీపీ నేత పట్టాభిరామ్‌ను కాసేపట్లో మరోసారి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు గన్నవరం పోలీసులు. పట్టాభిరామ్ మెడికల్ రిపోర్టును కోర్టుకు అందించనున్నారు పోలీసులు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా రిమాండ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు తనను కొట్టారని నిన్న న్యాయమూర్తి ఎదుట పట్టాభి చెప్పడంతో.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి తన ఎదుట ప్రవేశ పెట్టాలని చెప్పారు. దీంతో పోలీసులు పట్టాభికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్ట్‌లు చేయించారు. అనంతరం పట్టాభిని గన్నవరం కోర్టు వద్దకు తీసుకుకెళ్లారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి ఇంటికి పట్టాభిని తీసుకెళ్లారు. అక్కడ కొద్ది సేపు ఉంచిన తరువాత పట్టాభిని తిరిగి తెల్లవారుజాము 2:30 గంటలకు గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story