Dharmana Prasada Rao : కార్యకర్తపై చేయిచేసుకున్న ఏపీ మంత్రి
By - TV5 Digital Team |16 April 2022 8:30 AM GMT
Dharmana Prasada Rao : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వాగత కార్యక్రమంలో కార్యకర్తపై చేయిచేసుకున్నారు.
Dharmana Prasada Rao : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వాగత కార్యక్రమంలో కార్యకర్తపై చేయిచేసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు అవాక్కయ్యారు. ధర్మానకు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సిక్కోలు నేతలు అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ధర్మాన సభా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. ఓ కార్యకర్త చేయి పట్టుకొని వదలకపోవడంతో మంత్రి ధర్మానకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయి ఆ కార్యకర్తపై చేయిచేసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com