ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు.

ఏపీలో నాలుగో దశ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు. సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పోలీసులను మోహరించారు. నాల్గవ దశ ఎన్నికల్లో 3వేల 299 పంచాయతీలకు గాను 554 ఏకగ్రీవమయ్యాయి. ఇక 33వేల 435 వార్డు మెంబర్లకు 10వేల 921 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన అన్నిచోట్లు పోలింగ్ జరుగనుంది. 13 జిల్లాల్లో 16 రెవెన్యూ డివిజన్లు, 161మండలాల్లో రేపు పంచాయతీ ఎన్నికలు సర్వం సిద్దంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story