Attack : వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి.. !

Attack : వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి.. !
Ongole Attack : ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి చేశారు. పైగా ఆ దృశ్యాలన్నీ రికార్డ్ చేశారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి చేశారు. పైగా ఆ దృశ్యాలన్నీ రికార్డ్ చేశారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చంపేస్తా అంటూ బెదిరించారు. ఈనెల 12వ తేదీన మంత్రి బాలినేని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సుబ్బారావు గుప్తా.. కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, అంబటి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి నేతల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అవడంతో సుబ్బారావుకు బెదిరింపులు మొదలయ్యాయి. వెంటనే భయపడి ఆయన ఓ లాడ్జ్‌లో దాక్కున్నా ఆచూకీ కనిపెట్టి మరీ ఆయనపై దాడి చేశారు.

నిన్న రాత్రే సుబ్బారావు ఇంటిపై దాడి జరిగింది. 15 మందిఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. భార్యా పిల్లల్ని భయాందోళనకు గురి చేశారు. సుబ్బారావుతో క్షమాపణ చెప్పించినా కూడా వదలకుండా ఆయన ఇంటిపై కూడా దాడి చేసి దారుణానికి పాల్పడ్డారు. బైక్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. దీన్ని ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

అటు, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని చెప్పిన సుబ్బారావు, తాను చెప్పింది మాత్రం ముమ్మాటికీ నిజమేనన్నారు. ఆ నలుగురు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి కచ్చితంగా నష్టం జరుగుతుందన్నారు. తనపై దాడి జరిగిన విషయాన్ని ఆయన బయటపెట్టలేదు.

Tags

Read MoreRead Less
Next Story