Bird Flu Alert : వామ్మో.. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ కలకలం.. కలెక్టర్లు హైఅలర్ట్

Bird Flu Alert : వామ్మో.. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ కలకలం.. కలెక్టర్లు హైఅలర్ట్

కొత్త కొత్త వైరస్ లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పక్షులు జంతువులు కూడా చాలా విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాధి వల్ల కోళ్లు, బాతులు ఇతర పక్షి జాతులపై ప్రభావం చూపిస్తోంది. అయితే ఇది NH5N1 అనే వైరస్ వల్ల వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. భారత్ లో కూడా గతంలో బర్డ్ ఫ్లూ చాలా కలకలం రేపింది.

ఏపీలో (AP) పౌల్ట్రీ యాజమాన్యానికి మళ్లీ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఏపీలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలాన్ని రేపుతోంది. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి ఒక ప్రళయం సృష్టించింది. దీంతో చాలామంది ప్రజలు కూడా మరణించారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంతమేరకు కరోనా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా తరుణంలో ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ కొత్త వైరస్ కునుకు లేకుండా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వైరస్ కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో చాలా కోళ్లు మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ వైద్య అధికారులు కోళ్ల శాంపిల్స్ తీసుకొని భోపాల్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు మృతి చెందాయి అంటూ అధికారులు తెలియజేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమ షాకవుతోంది.

ఏపీ పశువర్ధన శాఖ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని చికెన్ షాపులను మూసివేయడమే మంచిదనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ ఎన్నో లక్షల సంఖ్యలో కోళ్లు ఈ వైరస్ వల్ల చనిపోయాయి.. చంపేశారు. కొన్నిచోట్ల మళ్లీ బిజినెస్ పెంచుకోవడానికి ఒక్క రూపాయికి లేదా ఫ్రీగా ఇచ్చేసిన సందర్భాలను చూశాం. ఇప్పుడు వైరస్ ను కట్టడి చేసేందుకు మళ్లీ చర్యలు ప్రారంభించింది పశుసంవర్ధక శాఖ.

Tags

Read MoreRead Less
Next Story