Chandrababu: తుఫాను సహాయక చర్యలపై దృష్టి పెట్టండి

Chandrababu: తుఫాను సహాయక చర్యలపై  దృష్టి పెట్టండి
పార్టీ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌పై మిగ్ జామ్‌ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. తుపాన్ ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించినందున తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. లోతట్టు, ముంపు బాధిత ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే విధంగా మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేసుకోవాలని, శిథిల భవనాల్లో ఉండొద్దని సూచించారు.

రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.. బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు.

ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా.. ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదని అన్నారు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

అన్నదాతల సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుఫాన్ బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story