Chandrababu : ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసీపీ ప్రభుత్వం డ్రామాకు తెరలేపింది : చంద్రబాబు
By - TV5 Digital Team |28 Jan 2022 1:00 PM GMT
Chandrababu : ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu : ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. ఆర్థిక ఉల్లంఘనలతో అంధకారంలోకి రాష్ట్ర భవిష్యత్ చేరిందన్నారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారన్నారు. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అన్నట్లుగా మారిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, దారుణ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఉద్యోగుల పీఆర్సీతో పాటు రాష్ట్రంలో ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కొత్త జిల్లాల డ్రామా అని అన్నారు చంద్రబాబు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం ఏం సాధించారని ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు ఎవరి కోసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విభజన హామీలు, పెండింగ్ అంశాలపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com