విచారణ పేరుతో సీఐడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు: దేవినేని ఉమ
By - TV5 Digital Team |4 May 2021 8:30 AM GMT
విచారణ పేరుతో సీఐడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సెక్షన్ 41 కింద హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే.. అధికారులు దాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు
విచారణ పేరుతో సీఐడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సెక్షన్ 41 కింద హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే.. అధికారులు దాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని అన్నారు. విచారణలో సహకరించినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారన్నారు దేవినేని ఉమ. రెండు రోజుల పాటు రోజుకు తొమ్మిది గంటల చొప్పున విచారణ చేసి.. మళ్లీ ఇవాళ కూడా పిలిచారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరినైనా, ఎప్పుడైనా విచారించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com