ఏపీ స్కూళ్లలో కరోనా‌.. 12 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లకు వైరస్‌..

ఏపీ స్కూళ్లలో కరోనా‌.. 12 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లకు వైరస్‌..

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం హైస్కూల్‌లో 12 మంది విద్యార్ధులు, నలుగురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం కలవరం రేపుతోంది. గత నెల 26న పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 4న ఫలితాలు వచ్చాయి. ఈలోపు మరెంత మందికి కరోనా సోకిందో అన్న ఆందోళన విద్యార్ధుల్లో నెలకొంది. తమ పిల్లలను స్కూల్‌కు పంపించడంపై తల్లిదండ్రులు పునరాలోచనలోపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story