పల్నాడు హరిజనవాడలో అగ్ని ప్రమాదం
By - Bhoopathi |14 Jun 2023 12:00 PM GMT
పల్నాడు జిల్లా పెదపాలెం హరిజనవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి నాలుగు గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మంటల్లో కాలిపోగా తీవ్రగా గాయాలతో తల్లి బయటపడింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు. ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని మండిపడుతున్నారు. ఇక ఫైర్ ఇంజన్ సైతం రాలేదని.. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com