నేనే ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారు : అరెస్ట్ తర్వాత లోకేష్..!

నేనే ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారు : అరెస్ట్ తర్వాత లోకేష్..!
12 గంటల హైడ్రామా తర్వాత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విడుదలయ్యారు. ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

12 గంటల హైడ్రామా తర్వాత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విడుదలయ్యారు. ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. తాను ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండడమే మేం చేసిన తప్పా అని అడిగారు. జగన్ సొంత ఇంట్లో చెల్లికి భద్రత లేదని, జగన్ సీఎం అయ్యాక మహిళల పై దాడులు పెరిగాయని అన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ఎద్దేవా చేశారు. మహిళల్ని కించపరిచే విధంగా మంత్రులే మాట్లాడుతున్నారని, వైసీపీ నేతల మాటల వల్ల మహిళల పై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఇక దిశ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. ఆ చట్ట ప్రకారం ఏ ఒక్కరికి శిక్ష పడలేదని అన్నారు. కేవలం సొంత మీడియాకి ప్రకటనలు ఇచ్చేందుకు దిశ చట్టం పనికొచ్చిందని అన్నారు. 20 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని లోకేష్ ఫైర్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story