ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్..ఆసక్తికర అంశాలు వెలుగులోకి..

ఎంపీ  కుటుంబ సభ్యుల కిడ్నాప్..ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. తాజాగా వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమయంలో సుబ్బలక్ష్మికి. తాను బాకీ ఉన్నానన్న రౌడీషీటర్ హేమంత్ కోటి రూపాయలలో 40 లక్షలు సుబ్బలక్ష్మికి ఇవ్వాలని సూచించాడు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి సుబ్బలక్ష్మి నిరాకరిచింది. దీంతో వైసీపీ నేత పేరును తెరపైకి తెచ్చాడు హేమంత్.అంతేకాదు అతడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుని అతడితో సుబ్బలక్ష్మికి ఫోన్ చేయించి డబ్బులు తీసుకునేలా చర్యలు తీసుకున్నాడు. అయితే.. ఆ వైసీపీ నేత ఈ వ్యవహారం గురించి పోలీసులు చెప్పలేదు. దీంతో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story